ఏపీలో కొత్తగా 8,846 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2020 8:18 PM ISTఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 70,511 శాంపిల్స్ను పరీక్షించగా.. 8,846 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటివరకు 4,86,531 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 92,353 మంది చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్బారిన పడి నిన్న 69 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5041కి చేరింది.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 299,
చిత్తూరులో 572,
ఈస్ట్ గోదావరిలో 1423,
గుంటూరులో 641,
కడపలో 661,
కృష్ణలో 398,
కర్నూలులో 314,
నెల్లూరులో 820,
ప్రకాశంలో 979,
శ్రీకాకుంలో 678,
విశాఖపట్నంలో 574,
విజయనగరంలో 532,
పశ్చిమ గోదావరి 955 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
Next Story