ఏపీ కరోనా బులెటిన్‌ విడుదల.. కొత్త కేసులు ఎన్నంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sep 2020 11:58 AM GMT
ఏపీ కరోనా బులెటిన్‌ విడుదల.. కొత్త కేసులు ఎన్నంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 75,013 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,835 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,92,760కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో తొమ్మిది మంది, నెల్లూరులో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, అనంతపూర్‌లో ఐదుగురు, కడపలో ఐదుగురు, కృష్ణలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కర్నూల్‌లో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మొత్తం 64 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,105కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4,97,376 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 90,279 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 725,

చిత్తూరులో 798,

ఈస్ట్‌ గోదావరిలో 1421,

గుంటూరులో 685,

కడపలో 536,

కృష్ణలో 396,

కర్నూలులో 424,

నెల్లూరులో 562,

ప్రకాశంలో 873,

శ్రీకాకుంలో 495,

విశాఖపట్నంలో 325,

విజయనగరంలో 544,

పశ్చిమ గోదావరి 1051 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story