ఏపీలో కొత్తగా మరో 8,555 కేసులు.. 67 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Aug 2020 1:33 PM GMT
ఏపీలో కొత్తగా మరో 8,555 కేసులు.. 67 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24గంటల్లో 52,834 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,555 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,58,764కి చేరింది.

కొవిడ్‌ వల్ల కృష్ణలో పదకొండు మంది, గుంటూరులో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,474 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 82,886 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 74,404 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 696,

చిత్తూరులో 781,

ఈస్ట్‌ గోదావరిలో 930,

గుంటూరులో 639,

కడపలో 396,

కృష్ణలో 379,

కర్నూలులో 996,

నెల్లూరులో 448,

ప్రకాశంలో 384,

శ్రీకాకుంలో 492,

విశాఖపట్నంలో 1227,

విజయనగరంలో 637,

పశ్చిమ గోదావరిలో 550 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story