ఏపీలో కరోనా విజృంభణ.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
By తోట వంశీ కుమార్ Published on 24 Sept 2020 6:16 PM ISTఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 76, 000 శాంపిల్స్ను పరీక్షించగా.. 7,855 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,385కి చేరింది.
కొవిడ్ వల్ల చిత్తూరులో ఎనిమిది మంది, అనంతపూర్లో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, కర్నూల్లో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున 52 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,558కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,79,474 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 69,353 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 497,
చిత్తూరులో 902,
ఈస్ట్ గోదావరిలో 1095,
గుంటూరులో 551,
కడపలో 545,
కృష్ణలో 346,
కర్నూలులో 325,
నెల్లూరులో 405,
ప్రకాశంలో 927,
శ్రీకాకుంలో 461,
విశాఖపట్నంలో 425,
విజయనగరంలో 384,
పశ్చిమ గోదావరి 992 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.