ఏపీలో కొత్తగా 7,073 కేసులు.. 48 మరణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2020 12:40 PM GMT
ఏపీలో కొత్తగా 7,073 కేసులు.. 48 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 69,429 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,073 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,61,458కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, అనంతపూర్‌లో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున 48 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,606కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,88,169 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 67,683 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 456,

చిత్తూరులో 413,

ఈస్ట్‌ గోదావరిలో 1031,

గుంటూరులో 533,

కడపలో 368,

కృష్ణలో 423,

కర్నూలులో 205,

నెల్లూరులో 459,

ప్రకాశంలో 806,

శ్రీకాకుంలో 430,

విశాఖపట్నంలో 340,

విజయనగరంలో 378,

పశ్చిమ గోదావరి 931 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story