తెలంగాణలో త‌గ్గిన‌ క‌రోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2020 3:48 AM GMT
తెలంగాణలో త‌గ్గిన‌ క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 582 మంది పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, న‌లుగురు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకకు 2,31,834 పాజిటవ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1,311 మంది మృతి చెందారు.

తాజాగా కరోనా నుంచి 1,432 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,11,912కు చేరింది. రాష్ట్రంలో 18,611 కేసులు యాక్టివ్‌లో ఉండగా, హోం ఐసోలేషన్లో 15,582 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 174 కేసులు నమోదయ్యాయి.

Next Story