ఏపీలో కొత్తగా మరో 58 కరోనా పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 3 May 2020 12:34 PM ISTఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 1583 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారీన పడి ఇప్పటి వరకు 33 మంది మరణించారు. మొత్తం నమోదైన కేసుల్లో 488 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1062 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 30 కేసులు నమోదు కాగా.. గుంటూరులో 11, కృష్ణాలో 8, అనంతపురంలో 7, చిత్తూరు, నెల్లూరులో ఒక్కో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇక రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 466 కేసులు నమోదు కాగా.. గుంటూరులో 319, కృష్ణాలో 266 కేసులు నమోదు అయ్యాయి. ఇక విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.