ఏపీలో రెడ్జోన్లో ఉన్న మండలాలివే..
By తోట వంశీ కుమార్ Published on 2 May 2020 1:27 PM ISTఏపీలో కరోనా మహమ్మారి విజృంబిస్తోంది. ఈ మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,525 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 33 మంది మృతి చెందారు. మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 441 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,051 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రతను బట్టి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ జిల్లాలను కేంద్ర ప్రకటించింది.
జిల్లాల వారిగా రెడ్ జోన్లో ఉన్న మండలాల వివరాలు..
గుంటూరు :
గుంటూరు, నరసరావుపేట, మాచర్ల, అచ్చంపేట, మంగళగిరి, పొన్నూరు, చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి
కర్నూలు :
కర్నూలు , నంద్యాల, బనగానపల్లి, పాణ్యం, ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు, ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు
పశ్చిమగోదావరి :
ఏలూరు, పెనుగొండ, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు, నరసాపురం
నెల్లూరు :
నెల్లూరు, నాయుడుపేట, వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు, కావలి, కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు
ప్రకాశం :
ఒంగోలు, చీరాల, కారంచేడు, కందుకూరు, గుడ్లూరు, కనిగిరి, కొరిసపాడు, మార్కాపురం, పొదిలి
తూర్పుగోదావరి :
శంఖవరం, కొత్తపేట, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి, అడ్డతీగల, పెద్దాపురం, రాజమహేంద్రవరం
కడప :
ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, పులివెందుల, మైదుకూరు, వేంపల్లె, ఎర్రగుంట్ల
చిత్తూరు :
శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు
అనంతపురం :
హిందూపురం, అనంతపురం, కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు
కృష్ణా :
విజయవాడ, పెనమలూరు, జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం
విశాఖపట్నం :
విశాఖ, పద్మనాభం, నర్సీపట్నం