ఏపీలో కొత్తగా మ‌రో 443 క‌రోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jun 2020 11:20 AM GMT
ఏపీలో కొత్తగా మ‌రో 443 క‌రోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16704 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 443 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 392 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 44 మంది.. 7 గురు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9372కి చేరింది.

గ‌డిచిన 24గంట‌ల్లో కొవిడ్‌ వల్ల కృష్ణాలో ఒక్క‌రు, కర్నూల్‌లో ఒక్కరు, అంనంత‌పురంలో ఒక్కరు, ప‌శ్చిమ గోదావ‌రిలో ఒక్క‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఒక్క‌రు.. మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 111కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4435 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4826 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారిగా అనంతపురంలో 70, చిత్తూరులో 29, ఈస్ట్‌ గోదావరిలో 64, గుంటూరులో 34, కడపలో 42, కృష్ణలో 15, కర్నూలులో 60, నెల్లూరులో 6, ప్రకాశంలో 07, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 6, పశ్చిమ గోదావరిలో 54 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఇదిలావుంటే.. గ‌డిచిన 24 గంట‌ల్లో 83 మంది డిచార్జ్ అయ్యారు.

Next Story