ఏపీలో 2100కి చేరిన క‌రోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2020 6:43 AM GMT
ఏపీలో 2100కి చేరిన క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 9,256 సాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 36 మందికి క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 48 మంది మృతి చెందారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 1192 మంది డిశ్చార్జి కాగా.. 860 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో చిత్తూరులో 9, గుంటూరులో 5, క‌డ‌ప‌లో 2, కృష్ణాలో 2, నెల్లూరులో 15, శ్రీకాకుళంలో 2 , ప‌శ్చిమ గోదావ‌రిలో 1 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్నూలులో అత్య‌ధికంగా 591 కేసులు న‌మోదు కాగా.. గుంటూరులో 404, కృష్ణాలో 351, చిత్తూరులో 151, అనంత‌పురంలో 118, నెల్లూరులో 126 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

36 new corona cases in last 24 hours in AP

Next Story