ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2020 1:16 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 77,028 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,949 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,14,774కి చేరింది.

కొవిడ్‌ వల్ల అనంత‌పూర్‌లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణ‌లో ముగ్గురు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ముగ్గు‌రు, చిత్తూరులో ఇద్ద‌రు, తూర్పు గోదావ‌రిలో ఇద్ద‌రు, ప్ర‌కాశంలో ఒక్క‌రు, విశాఖ‌ప‌ట్నంలో ఒక్క‌రు చొప్పున 18 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 6,643కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 7,81,509 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 26,622 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story