ఏపీలో 40వేలకు చేరుకున్న కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2020 8:56 AM GMT
ఏపీలో 40వేలకు చేరుకున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 40వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 20,245 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2602 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 2592 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది ఉండగా.. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరు ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 40646కి చేరింది.

కొవిడ్‌ వల్ల అనంత‌పురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు చొప్పున మొత్తం 42 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 534 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 20298 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 19814 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 297,

చిత్తూరులో 328,

ఈస్ట్‌ గోదావరిలో 643,

గుంటూరులో 367,

కడపలో 55,

కృష్ణలో 37,

కర్నూలులో 315,

నెల్లూరులో 127,

ప్రకాశంలో 53,

శ్రీకాకుంలో 149,

విశాఖపట్నంలో 23,

విజయనగరంలో 89,

పశ్చిమ గోదావరిలో 109 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story