ఏపీలో 38వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2020 10:02 AM GMT
ఏపీలో 38వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22,304 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2593 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 2584 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 9 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 38044కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావరిలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, చిత్తూర్‌లో ఐదుగురు, కడపలో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూల్‌లో ఒక్కరు. శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 492 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 19393 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 18159 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 174,

చిత్తూరులో 205,

ఈస్ట్‌ గోదావరిలో 500,

గుంటూరులో 139,

కడపలో 126,

కృష్ణలో 132,

కర్నూలులో 590,

నెల్లూరులో 126,

ప్రకాశంలో 104,

శ్రీకాకుంలో 111,

విశాఖపట్నంలో 81,

విజయనగరంలో 101,

పశ్చిమ గోదావరిలో 195 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story