ఏపీలో కరోనా తగ్గుముఖం.. గడిచిన 24గంటల్లో 25 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 11:51 AM ISTఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,880 సాంపిల్స్ను పరీక్షించగా.. 25 మందికి కరోనా పాజిటివ్గా వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2230 కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 50 మంది మృతి చెందారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 1433 మంది డిశ్చార్జి కాగా.. 747 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో చిత్తూరులో 4, గుంటూరులో 4, కర్నూలులో 3, నెల్లూరులో 1, ప్రకాశంలో 3,శ్రీకాకుళంలో 7,
విశాఖపట్నంలో 3 నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కర్నూలులో అత్యధికంగా 611 కేసులు నమోదు కాగా.. గుంటూరులో 417, కృష్ణాలో 367, చిత్తూరులో 177, అనంతపురంలో 122, నెల్లూరులో 150 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Next Story