తెలంగాణలో కొత్తగా 1,764 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2020 4:56 AM GMT
తెలంగాణలో కొత్తగా 1,764 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(మంగళవారం 28న) 18,858 శాంపిల్స్‌ను పరీక్షించగా..కొత్తగా మరో 1,764 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 12 మంది మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 58,906కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి మొత్తం 492 ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 803 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 43,751కి చేరింది. 14,663 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్‌ – 15

భద్రాద్రి కొత్తగూడెం-30

జీహెచ్‌ఎంసీ -509

జగిత్యాల-12

జనగాం-13

జయశంకర్‌ భూపాలపల్లి –8

జోగులాంబ గద్వాల -22

కామారెడ్డి -10

కరీంనగర్‌ -93

ఖమ్మం -69

ఆసిఫాబాద్‌ -6

మహబూబ్‌ నగర్‌ -47

మహబూబాబాద్‌ -9

మంచిర్యాల- 28

మెదక్‌ – 23

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 158

ములుగు –17

నాగర్‌కర్నూల్‌ – 29

నల్లగొండ – 51

నారాయణపేట -7

నిర్మల్‌ -8

నిజామాబాద్‌ –47

పెద్దపల్లి -44

రాజన్న సిరిసిల్ల -13

రంగారెడ్డి -147

సంగారెడ్డి -89

సిద్దిపేట – 21

సూర్యాపేట-38

వికారాబాద్‌-7

వనపర్తి – 4

వరంగల్‌ రూరల్‌ -41

వరంగల్‌ అర్భన్‌ -138

యాదాద్రి భువనగిరి -11

Next Story