తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 3:19 AM GMT
తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,602 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, న‌లుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి రాష్ట్రంలో 2,47,284 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 1366కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్క రోజే 982 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,26,646కు చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 19,272 యాక్టివ్‌ కేసులుండగా, వారిలో 16,522 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న ఒక్క రోజు అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 295 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ త‌ర్వాత అ‌త్య‌ధికంగా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 137, రంగారెడ్డి జిల్లాలో 118 కేసులు న‌మోద‌య్యాయి. మిగ‌తా జిల్లాల్లో ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోద‌య్యాయి.

Next Story