తెలంగాణ‌లో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి.. కొత్త‌గా 1410 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2020 4:35 PM GMT
తెలంగాణ‌లో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి.. కొత్త‌గా 1410 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 5,954 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1,410 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 30,946 కేసులు నమోదు కాగా, 331 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 918 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 125 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 67 కేసులు, క‌రీంన‌గ‌ర్‌‌ జిల్లాలో 32 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 79 కేసులు, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌‌ జిల్లాలో 15 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 21 కేసులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో 34 కేసులు, మెద‌క్‌‌ జిల్లాలో 17 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 18 కేసులు, కొత్త‌గూడెం జిల్లాలో 23 కేసులు, ఖ‌మ్మం జిల్లాలో 12 కేసులు, సూర్యాపేట జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. గ‌త ఇర‌వై రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18192 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 12423 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 913 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌



Next Story