ఏపీలో 24వేలకు చేరువలో కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2020 8:32 AM GMT
ఏపీలో 24వేలకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డు సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16,882 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 1555 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1500 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 53 మంది.. విదేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,814కి చేరింది.

కొవిడ్‌ వల్ల కర్నూలు, గుంటూరులో ముగ్గురు, అనంతపూర్‌, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణ, పశ్చిమగోదావరి, చిత్తూరులో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 277కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 12,154 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 11,383మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా

అనంతపురంలో 91,

చిత్తూరులో 236,

ఈస్ట్‌ గోదావరిలో 47,

గుంటూరులో 228,

కడపలో 114,

కృష్ణలో 127,

కర్నూలులో 73,

నెల్లూరులో 31,

ప్రకాశంలో 96,

శ్రీకాకుంలో 206,

విశాఖపట్నంలో 208,

విజయనగరంలో 26,

పశ్చిమ గోదావరిలో 17 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story