ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 125 కేసులు
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Jun 2020 2:04 PM ISTఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14246 సాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 125 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3843కి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. ఇక ఈ మహమ్మారి వల్ల చనిపోయిన వారి సంఖ్య 75.
మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2387 మంది డిశ్చార్జి కాగా.. 1381మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 131 మందికి కరోనా సోకగా.. ఒకరు నేడు డిచ్చార్జ్ అవగా.. 126 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 838 మంది కరోనా బారినపడగా.. 16 మంది డిచ్చార్జ్ అవగా.. 520 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
— ArogyaAndhra (@ArogyaAndhra) June 8, 2020