ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2020 2:01 PM GMT
ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 61,838 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,830 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,82,469కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావరిలో పదకొండు మంది, ప్రకాశంలో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, అనంతపూర్‌లో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, కర్నూల్‌లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున మొత్తం 81 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,541 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,86,720 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 92,208 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 728,

చిత్తూరులో 913,

ఈస్ట్‌ గోదావరిలో 1528,

గుంటూరులో 532,

కడపలో 728,

కృష్ణలో 299,

కర్నూలులో 745,

నెల్లూరులో 1168,

ప్రకాశంలో 786,

శ్రీకాకుంలో 618,

విశాఖపట్నంలో 1156,

విజయనగరంలో 564,

పశ్చిమ గోదావరిలో 1065 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story