ఏపీలో కొత్తగా 10,825 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sep 2020 2:50 PM GMT
ఏపీలో కొత్తగా 10,825 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 69,623 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,825 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,87,331కి చేరింది.

కొవిడ్‌ వల్ల నెల్లూరులో పదమూడు మంది, అనంతపూర్‌లో ఎనిమిది మంది, పశ్చిమగోదావరిలో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, విజయనగరంలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, కృష్ణలో నలుగురు, కడపలో ముగ్గురు, కర్నూల్‌లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు చొప్పున 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,347 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,82,104 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 1,00,880 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 549,

చిత్తూరులో 938,

ఈస్ట్‌ గోదావరిలో 1399,

గుంటూరులో 641,

కడపలో 1039,

కృష్ణలో 337,

కర్నూలులో 433,

నెల్లూరులో 1046,

ప్రకాశంలో 1332,

శ్రీకాకుంలో 601,

విశాఖపట్నంలో 765,

విజయనగరంలో 642,

పశ్చిమ గోదావరి 1103 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story