ఏపీ కరోనా బులెటిన్‌ విడుదల.. కొత్త కేసులు ఎన్నంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sept 2020 7:07 PM IST
ఏపీ కరోనా బులెటిన్‌ విడుదల.. కొత్త కేసులు ఎన్నంటే..?

ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 59,919 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,776 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో తొమ్మిది మంది, ప్రకాశంలో తొమ్మిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, కర్నూల్‌లో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున 76 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,276 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,70,163 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 1,02,067 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 750,

చిత్తూరులో 970,

ఈస్ట్‌ గోదావరిలో 1405,

గుంటూరులో 708,

కడపలో 727,

కృష్ణలో 378,

కర్నూలులో 702,

నెల్లూరులో 1270,

ప్రకాశంలో 1256,

శ్రీకాకుంలో 538,

విశాఖపట్నంలో 560,

విజయనగరంలో 588,

పశ్చిమ గోదావరి 924 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story