ఏపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 10,603 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 12:25 PM GMT
ఏపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 10,603 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 63,077 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,603 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,24,767కి చేరింది.

కొవిడ్‌ వల్ల నెల్లూరులో పద్నాలుగు మంది, చిత్తూరులో పన్నెండు మంది, కడపలో తొమ్మిది మంది, అనంతపూర్‌లో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, కర్నూల్‌లో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు మొత్తం 88 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,21,754 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 99,129 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 695,

చిత్తూరులో 948,

ఈస్ట్‌ గోదావరిలో 1090,

గుంటూరులో 593,

కడపలో 952,

కృష్ణలో 383,

కర్నూలులో 811,

నెల్లూరులో 1028,

ప్రకాశంలో 881,

శ్రీకాకుంలో 819,

విశాఖపట్నంలో 866,

విజయనగరంలో 558,

పశ్చిమ గోదావరి 979 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story