ఏపీలో కొత్తగా 10,418 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2020 1:17 PM GMT
ఏపీలో కొత్తగా 10,418 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 71,692 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,418 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,27,512కి చేరింది.

కొవిడ్‌ వల్ల కడపలో తొమ్మిది మంది, నెల్లూరులో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, కర్నూల్‌లో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విజయనగరంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు చొప్పున 74 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,634కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4,25,607 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 97,271 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 801,

చిత్తూరులో 887,

ఈస్ట్‌ గోదావరిలో 1399,

గుంటూరులో 707,

కడపలో 785,

కృష్ణలో 350,

కర్నూలులో 484,

నెల్లూరులో 949,

ప్రకాశంలో 1271,

శ్రీకాకుంలో 660,

విశాఖపట్నంలో 414,

విజయనగరంలో 577,

పశ్చిమ గోదావరి 1134 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story