ఏపీలో వరుసగా మూడో రోజు 10వేలు దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2020 12:07 PM GMT
ఏపీలో వరుసగా మూడో రోజు 10వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 61,699 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,376 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,40,933కి చేరింది.

కొవిడ్‌ వల్ల గుంటూరులో పదమూడు మంది, అనంతపూర్‌లో తొమ్మిది మంది, కర్నూల్‌లో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, కడపలో ఒక్కరు, కృష్ణలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 68 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,349 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 63,864 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 75,720 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1387,

చిత్తూరులో 789,

ఈస్ట్‌ గోదావరిలో 1215,

గుంటూరులో 906,

కడపలో 646,

కృష్ణలో 313,

కర్నూలులో 1124,

నెల్లూరులో 861,

ప్రకాశంలో 406,

శ్రీకాకుంలో 402,

విశాఖపట్నంలో 983,

విజయనగరంలో 388,

పశ్చిమ గోదావరిలో 956 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story