ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్క రోజే పది వేలకు పైగా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2020 12:13 PM GMT
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్క రోజే పది వేలకు పైగా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 7వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 70,584 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,093 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,20,390కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావరిలో పద్నాలుగు మంది, అనంతపూర్‌లో ఎనిమిది మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్‌లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, కృష్ణలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున 65 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,213 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 55,406 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 63,771 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1371,

చిత్తూరులో 819,

ఈస్ట్‌ గోదావరిలో 1676,

గుంటూరులో 1124,

కడపలో 734,

కృష్ణలో 259,

కర్నూలులో 1091,

నెల్లూరులో 608,

ప్రకాశంలో 242,

శ్రీకాకుంలో 496,

విశాఖపట్నంలో 841,

విజయనగరంలో 53,

పశ్చిమ గోదావరిలో 779 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story