చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య
By తోట వంశీ కుమార్ Published on 14 July 2020 7:57 AM GMT
భర్త, అత్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్రవంతి(31)కి కంకణాల సంతోష్ కుమార్తో 2017లో వివాహాం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వీరు గోపన్ పల్లి తండాలోని ముప్పా అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు.
సోమవారం రాత్రి భర్త సంతోష్, అత్తతో స్రవంతికి గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన స్రవంతి మంగళవారం తెల్లవారు జామున ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story