మీడియా ప్రతినిధులపై మహిళల దాడి.. ఎందుకంటే..?

By సుభాష్  Published on  27 Dec 2019 11:14 AM IST
మీడియా ప్రతినిధులపై మహిళల దాడి.. ఎందుకంటే..?

ముఖ్యమంత్రి జగన్‌ ఏపీకి మూడు రాజధానులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉద్దండరాయునిపాలెంలో నిరసన దృశ్యాలను చిత్రీకరిందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మహిళలు దాడి చేశారు. రాజధాని మహిళలతో ఓ మీడియా అనుచితంగా మాట్లాడటంతో మహిళలు దాడికి దిగినట్లు తెలుస్తోంది. మహిళా యాంకర్‌, కెమెరామెన్‌లను వెంటపడి మరి దాడి చేసినట్లు సమాచారం. కాగా, అక్కడున్న మహిళలు మమ్మల్ని చూపించమని అడగడంతో, అందుకు మీడియా ప్రతినిధులు మీరు కూలీలు అని సంబోధించడంతో మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. జగన్‌ మూడు రాజధానులు ప్రకటించిన నేపథ్యంలో తాము నిరసనలు, ఆందోళనలు చేపడుతుంటే మీకు కూలీలుగా కనిపిస్తున్నామంటూ వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది.

Next Story