రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి
రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
అమరావతి: నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
రేపు శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, విశాఖ,అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, తూగో,పగో,ఏలూరు,కృష్ణా,NTR, గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు,కర్నూలు,నంద్యాల, అనంతపురం,సత్యసాయి,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. pic.twitter.com/pSdW20xXqm
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 21, 2025
అటు తెలంగాణలో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) June 21, 2025