Warangal: పీజీ మెడికో ఆత్మహత్య కేసు.. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్

పీజీ మెడికో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన కేసులో నిందితుడు డాక్టర్ మహ్మద్ సైఫ్‌కు

By అంజి  Published on  20 April 2023 7:32 AM GMT
Warangal , PG Medico Suicide Case, Telangana news

Warangal: పీజీ మెడికో ఆత్మహత్య కేసు.. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్

హైదరాబాద్: పీజీ మెడికో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన కేసులో నిందితుడు డాక్టర్ మహ్మద్ సైఫ్‌కు వరంగల్ జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000, ఇద్దరు పూచీకత్తుల గ్యారెంటీతో నిందితుడికి బెయిల్ మంజూరైంది. తదుపరి 16 వారాల పాటు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా లేదా విచారణకు బెదిరింపులు వచ్చినా బెయిల్‌ను రద్దు చేయవచ్చు.

తెలంగాణ పీజీ మెడికో ఆత్మహత్య కేసు

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో అనస్థీషియా విభాగంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ (MD) మొదటి సంవత్సరం చదువుతున్న డాక్టర్ డీ. ప్రీతిని ఆమె సీనియర్ వేధింపులకు గురిచేయడంతో.. ఆమె ఆత్మహత్యతో మరణించింది. ఆ తర్వాత కేఎంసీలో రెండవ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రీతిని అవమానించేందుకే సైఫ్ ఆమెను టార్గెట్ చేసి వేధింపులకు గురిచేశాడని వాట్సాప్ చాట్‌లను అధికారులు విశ్లేషించారు.

విచారణ తర్వాత కేఎంసీలోని కొంతమంది పీజీ మెడికల్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు యూజ్‌ చేస్తున్న వాట్సాప్ గ్రూప్‌లలో ఆమె గురించి “అవమానకరమైన వ్యాఖ్యలు” పోస్ట్ చేయడం ద్వారా ప్రీతిని నిరంతరం వేధింపులకు గురి చేయడం ద్వారా ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించారనే ఆరోపణలపై పోలీసులు సైఫ్‌పై కేసు నమోదు చేశారు.

Next Story