వైజాగ్ నుండి విజయవాడకు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌

Vande Bharat Express to chug from Vizag to Vijayawada.వైజాగ్‌ నుంచి విజయవాడకు హైస్పీడ్ 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌'ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2022 9:48 AM GMT
వైజాగ్ నుండి విజయవాడకు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌

విశాఖపట్నం: వైజాగ్‌ నుంచి విజయవాడకు హైస్పీడ్ 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌'ను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఈ రైలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ తరహాలో పగటిపూట నడిచే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్రయాణ సమయం 12 నుంచి 14 గంటలు ఉండ‌గా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వ‌స్తే ఈ స‌మ‌యం 8 గంటలకు త‌గ్గ‌నుంది.

మొదటగా ఈ రైలు విశాఖపట్నం నుండి విజయవాడ వరకు నడపబడుతుంది. ఆ తరువాత సికింద్రాబాద్ వరకు పొడిగించబడుతుంది. భారతీయ రైల్వేలు ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. విశాఖపట్నం-సికింద్రాబాద్ మార్గంలో ఇది ఆరో రైలు. కొద్ది రోజుల క్రితం చెన్నై-మైసూర్ మధ్య రైలు సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

వైజాగ్-సికింద్రాబాద్ మధ్య 'వందే భారత్' రైళ్లు నడపనున్నట్లు దక్షిణ-మధ్య రైల్వే (SCR) తెలిపింది. ప్రస్తుతం ఒక ర్యాక్‌ మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి రైలు మొదట విశాఖపట్నం నుండి విజయవాడ వరకు నడపబడుతుంది. ఆ తరువాత సికింద్రాబాద్ వరకు పొడిగించబడుతుంది. వైజాగ్-విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో ఉండే టైం ట్రావెల్ నాలుగు గంటలకు తగ్గించబడుతుంది.

విశాఖపట్నంలో ట్రాక్‌పై త్వరలో ట్రయల్‌ రన్‌ ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

వందేభారత్ రైలు సర్వీసులను తిరుపతి వరకు పొడిగించే అవకాశాలను కూడా అధికారులు ప‌రిశీలిస్తున్నారు. సికింద్రాబాద్-తిరుపతి నుంచి రైలు నడపినట్లయితే.. విజయవాడ నుండి ప్రయాణీకుల రద్దీ, సమయం తగ్గుతుంది.

వందే భారత్ రైళ్లు ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, ముంబై సెంట్రల్-గాంధీనగర్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా మరియు MGR చెన్నై సెంట్రల్-మైసూరు మార్గాల్లో నడుస్తున్నాయి.



ప్ర‌త్యేక‌లు

- ఇది ఏసీ రైలు. 16 కోచ్‌ల‌లో 1,128 సీట్లు అందుబాటులో ఉంటాయి.

- వేగాన్ని పెంచేందుకు మ‌రియు త‌గ్గించేందుకు అత్యాదునిక బ్రేకింగ్ సిస్ట‌మ్ ఈ రైలు సొంతం.

-వందే భారత్ రైళ్లు 0-100 కి.మీ వేగాన్ని 52 సెకన్లలో అందుకోగలవు, గ‌రిష్ట వేగం 180 కి.మీ.

- అన్ని కోచ్‌లలో ఆటోమేటిక్ డోర్లు, GPS ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లు, మరియు దివ్యాంగల కొర‌కు మెరుగైన‌ సౌకర్యాలు ఉంటాయి.

- వినోద ప్రయోజనాల కోసం బోర్డులో హాట్‌స్పాట్ వైఫై.

-ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో తిరిగే కుర్చీలు ఉంటాయి.

-బయో-వాక్యూమ్ మోడల్ టాయిలెట్లు

-పాంట్రీ సౌకర్యం భోజనం, పానీయాలను అందిస్తుంది.

Next Story