వైజాగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Here are few things to know about Vizag. తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించిన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత విశాఖపట్నం

By అంజి  Published on  1 Feb 2023 9:57 AM GMT
వైజాగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించిన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత విశాఖపట్నం కొత్త రాజధానిగా అవతరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ దౌత్య కూటమి సమావేశంలో ప్రకటించారు. 2015లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని కొత్త రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అయితే 2020లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధాని నగరాలను - అమరావతి, విశాఖపట్నం, కర్నూలుగా సీఎం జగన్‌ ప్రభుత్వం ప్లాన్ చేసింది. గత ఏడాది మార్చిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి చెప్పింది.

ఏపీ రాజధాని, కోస్తా నగరమైన విశాఖపట్నంను వైజాగ్ అని కూడా పిలుస్తారు.

'రెండవ అతిపెద్ద నగరం'

తూర్పు కనుమల పర్వత శ్రేణి, బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న విశాఖ నగరం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఓడరేవు నగరాల్లో ఒకటిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన నగరం ఇదే. ఇది భారతదేశంలోని తూర్పు తీరంలో చెన్నై తర్వాత రెండవ అతిపెద్ద నగరం. ఈ నగరాన్ని అనేక బీచ్‌లు, మ్యూజియంలు, దేవాలయాలు పర్యాటక హాట్‌స్పాట్‌గా కూడా మార్చాయి.

రెండు ఓడరేవులతో కూడిన నగరం

ఆర్థిక రాజధానిగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, దేశంలోని రెండు అతిపెద్ద ఓడరేవులను కలిగి ఉన్న భారతదేశంలోని ఏకైక నగరం - వైజాగ్ పోర్ట్, గంగవరం పోర్ట్. 1933లో ప్రారంభించబడిన విశాఖపట్నం ఓడరేవు.. 2022లో నిర్వహించబడిన కార్గో పరిమాణం పరంగా భారతదేశపు మొదటి ఐదు ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. గంగవరం మొత్తం 21 మీటర్ల లోతుతో భారతదేశపు లోతైన ఓడరేవుగా గుర్తింపు పొందింది. ఇది 2009లో ప్రారంభించబడింది.

మొదటి నౌకాదళ షూటింగ్ రేంజ్

ఆగస్టు 2022లో తూర్పు సముద్రతీరంలోని ఐఎన్‌ఎస్‌ కర్ణలో తూర్పు నౌకాదళ కమాండ్, ఫ్లాగ్-ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్-అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా కాంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ (CISR)ని ప్రారంభించారు. భారతదేశంలోని మొదటి-రకం షూటింగ్ రేంజ్, ఇది తూర్పు నావల్ కమాండ్ మూడు ప్రధాన స్థావరాలలో ఒకటిగా పనిచేస్తుంది. ఈఎన్‌సీ ప్రధాన కార్యాలయం కూడా ఉంది.

దక్షిణాసియాలో తొలి జలాంతర్గామి మ్యూజియం

1969లో కొనుగోలు చేసిన మొదటి నాలుగు జలాంతర్గాములలో ఒకటైన ఇండియన్ నేవీకి చెందిన జలాంతర్గామి కుర్సురను మ్యూజియంగా మార్చారు. ఈ జలాంతర్గామి 1971 ఇండో-పాకిస్తాన్ వివాదంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దీనిని 2001లో నేవీ నుంచి తప్పించారు. 2002లో రామ కృష్ణ బీచ్ సమీపంలో దక్షిణాసియాలో మొట్టమొదటి జలాంతర్గామి మ్యూజియంగా ఇది రూపాంతరం చెందింది. ఇది ప్రపంచంలోనే రెండవ జలాంతర్గామి మ్యూజియం, అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు.

భారతదేశంలోని పురాతన షిప్‌యార్డ్

1941లో స్థాపించబడిన హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి, పురాతన షిప్‌యార్డ్. 2022లో హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ తన చరిత్రలో అత్యధిక ఉత్పత్తి విలువను నమోదు చేసింది.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్

1971లో స్థాపించబడిన గాజువాకలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాల్లో ఉన్న ఏకైక భారతీయ తీర ఆధారిత స్టీల్ ప్లాంట్. ప్లాంట్ 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 5.773 మిలియన్ టన్నుల హాట్ మెటల్, 5.272 మిలియన్ టన్నుల ముడి ఉక్కు, 5.138 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా విలువ ఆధారిత ఉక్కును ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించింది.

Next Story