విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బీఆర్‌ఎస్‌ కాపాడుతుంది: తోట చంద్రశేఖర్

విశాఖపట్నం: స్థానిక ఆందోళనలో పాల్గొనడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (విఎస్‌పి)ని ప్రైవేటీకరణ నుండి తమ

By అంజి  Published on  9 April 2023 1:31 AM GMT
BRS, Visakhapatnam steel plant, AP BRS president ,Thota Chandrasekhar

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బీఆర్‌ఎస్‌ కాపాడుతుంది: తోట చంద్రశేఖర్

విశాఖపట్నం: స్థానిక ఆందోళనలో పాల్గొనడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (విఎస్‌పి)ని ప్రైవేటీకరణ నుండి తమ పార్టీ కాపాడుతుందని ఆంధ్రప్రదేశ్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రిలే నిరాహారదీక్షకు పార్టీ మద్దతు ఉంటుందని, వారితో కలిసి ఆందోళన చేసేందుకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటి రామారావు ఇటీవల మాట్లాడిన విషయం తెలిసిందే.

అంతకుముందు శనివారం విశాఖకు చేరుకున్న చంద్రశేఖర్‌కు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి వేదికైన వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనా వరకు ర్యాలీగా వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బీజేపీ వెంటే నడుస్తున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించే ధైర్యం వారికి లేదన్నారు. తెలుగు ప్రజల త్యాగాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని నిర్మించామని, ఆందోళనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు.. కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడానికి కేంద్ర బిందువుగా మారారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌తో సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని యోచిస్తోందన్నారు. ఏప్రిల్ 10న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తామని చంద్రశేఖర్ తెలిపారు.

Next Story