వికారాబాద్ జిల్లా శంకర్పల్లి సమీపంలోని రైల్వే ట్రాక్పై ఓ మహిళ కారు నడుపుతూ వెళ్లడం భయాందోళనకు గురి చేసింది. శంకర్పల్లి నుంచి హైదరాబాద్ మీదుగా రైల్వే ట్రాక్పై కారు నడుపుతున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. కారు ఆపేందుకు ప్రయత్నించిన రైల్వే సిబ్బంది ప్రయత్నించిన విఫలమైయ్యారు. ట్రాక్పైకి కారు రావడంతో పలు రైళ్లను రైల్వే సిబ్బంది నిలిపివేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు రావలసిన రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. చివరకు కారు ఆపిన అధికారులు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కారును స్వాధీనం చేసుకుని, మహిళను అదుపులోకి తీసుకున్నారు.