ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తుల దాడి

By సుభాష్  Published on  3 Jun 2020 4:20 AM GMT
ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తుల దాడి

ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో చోటుచేసుకుంది. విజయపురిసౌత్ ఎస్ ఐ పాల్ రవీందర్ కథనం ప్రకారం హస్నాబాద్ తండాలో నాటుసారా అక్రమంగా తయారు చేస్తున్న బట్టి లపై దాడి చేసి 20 లీటర్ ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు గత నెలలో అదే గ్రామంలో 7,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

దీంతో గ్రామాన్ని టార్గెట్ చేసిన ఎక్సైజ్ అధికారులపై ఊహించని రీతిలో సుమారు 100 మంది వరకు గ్రామస్తులు గుమిగూడారు. అయితే వీరిలో సుమారు 15 మంది వ్యక్తులు రాళ్ళతో మాచర్ల ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి తో పాటు సిబ్బంది, కారును దాడి చేశారు. దీనితో కొండారెడ్డి తో పాటు సిబ్బందికి గాయాలు కాగా కారు సైతం అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న విజయపురి సౌత్ ఎస్ ఐ హస్నాబాద్ తండా గ్రామానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Next Story