విద్యార్హతపై తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబును గురువారం అర్థరాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 18 గంటల పాటు సీఐడీ పోలీసులు అశోక్బాబును తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. అనంతరం విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి సత్యవతి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో అశోక్బాబును పోలీసులు విడుదల చేశారు.
అక్రమ అరెస్టుకు గురైన ఎమ్మెల్సీ అశోక్బాబు ఇంటికెళ్లి సంఘీభావం తెలిపిన టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. https://t.co/9vY1O37Gt6