ఇంగ్లీష్ వింగ్లీష్: ట్రోల్స్‌కు భ‌య‌ప‌డ‌మంటున్న నిడమూరు జ‌డ్పీహెచ్ఎస్ విద్యార్థులు

English Vinglish Students of Nidamamuru ZPHS not afraid of being trolled for speaking English.విజయవాడలోని నిడమూరులోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2022 6:20 AM GMT
ఇంగ్లీష్ వింగ్లీష్: ట్రోల్స్‌కు భ‌య‌ప‌డ‌మంటున్న నిడమూరు జ‌డ్పీహెచ్ఎస్ విద్యార్థులు

విజయవాడలోని నిడమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) విద్యార్థులు ఆటోమొబైల్ ఇంజనీర్ కావాల‌నే, కారు కనిపెట్టాలనే, రైల్వే అధికారి కావాల‌నే కలలతో ఆంగ్లం(ఇంగ్లీష్‌) నేర్చుకుంటున్నారు. ఇక్క‌డ ఇంగ్లీష్ నేర్చుకునే ప్ర‌తీ విద్యార్థికి ఓ ల‌క్ష్య‌మంటూ ఉంది. ఈ పాఠ‌శాల‌లో ఆరు నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు క‌నీసం 100 మంది విద్యార్థులు ఇప్ప‌టికే త‌మ భ‌విష్య‌త్ ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుని ఆ దిశ‌గా తొలి అడుగులు వేయ‌డం ప్రారంభించారు.

ముఖ్యంగా ఎదుటి వారితో క‌మ్యూనికేట్ చేయ‌డం ముఖ్య‌మ‌ని బావించి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఫర్హీన్ మాట్లాడుతూ.. ''మా అమ్మ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌. నేను, నా స్నేహితులు ఇంగ్లీషులో మాట్లాడుతున్న వీడియోలను తన స్కూల్‌ పిల్లలకు చూపించి, బాగా నేర్చుకోమని వారికి చెబుతోంది. ఇది నిజంగా నాకు ఎంతో గ‌ర్వ‌కార‌కంగా ఉంది అని అంటోంది.

ఎలా మొదలైంది?

స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) మరియు సర్వశిక్షా అభియాన్ నిర్వహించిన స్పోకెన్ ఇంగ్లీష్ కోసం వేసవి శిబిరంలో ఇదంతా ప్రారంభమైంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన పాఠశాలల్లో జడ్పీహెచ్‌ఎస్ నిడమూరు ఒకటిగా ఎంపికైంది. దాదాపు 100 మంది విద్యార్థులు 12 రోజుల వర్క్‌షాప్‌కు హాజరయ్యారు, ప్రతి జిల్లా నుండి సుమారు 15 మంది రిసోర్స్ పర్సన్‌లు వారికి ఇంగ్లీష్ నేర్పించారు.


పాఠ‌శాల‌లోని ఇంగ్లీష్ అసిస్టెంట్ శ్రీదేవి మాట్లాడుతూ.. విద్యార్థుల‌కు వ్యాకరణ దోషాలు లేకుండా ఇంగ్లీష్ ఉచ్చరించడం, చదవడం మరియు మాట్లాడటం ఎలాగో నేర్పించ‌డం ఇది ఒక పూర్తి రోజు సెష‌న్ అని చెప్పారు. విద్యార్థులు వారి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని తాము కోరుకున్నామని, ఇందుకోసం వారికి తాము వాట్సాప్ గ్రూప్‌ను కూడా సృష్టించి ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఇందులో ప్ర‌తీవారం విద్యార్థులు చ‌ర్చించాల్సిన అంశాల‌పై డిస్క‌స్ చేసుకుంటార‌ని తెలిపారు.

'ఎలోన్ మస్క్ నా స్ఫూర్తి'

వ్యాపార దిగ్గ‌జం, టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ త‌న‌కు స్పూర్తి అని తొమ్మిదో తరగతి చ‌దువుతున్న ఫ‌ర్హీన్ చెప్పింది. తాను ఓ కారుని క‌నిపెట్టి అందులో తన తల్లిదండ్రుల‌తో క‌లిసి ప్ర‌యాణించాల‌ని అనుకుంటోంది. "భవిష్యత్తులో ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వాల‌న్న వేరే వారితో క‌మ్యూనికేట్ చేయాల‌న్న ఇంగ్లీష్ అవ‌స‌రం. నాకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మెజారిటీ IAS అధికారులు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చారు, కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని మనం గర్వపడాలని నేను భావిస్తున్నాను" అని ఫర్హీన్ అన్నారు.

మా ఇంటి ప‌క్క‌న ఉన్న వాళ్లు షాకైయ్యారు

"ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం చాలా మందికి షాక్‌గా ఉంది. మా ఇంటి ప్ర‌క్క‌ల వాళ్లు కూడా షాక్ అయ్యారు. వారు నా వీడియోలను చూసినప్పుడు , నేను ఇంగ్లీష్‌లో మాట్లాడే నైపుణ్యం గురించి మా కుటుంబం మాట్లాడం విని, వారి ముఖాల్లో ఆశ్చ‌ర్యం క‌నిపించింది. వారు న‌న్ను చాలా ప్ర‌శ్న‌లు అడిగారు అని ఏడో తరగతి విద్యార్థిని దామిని తివారీ చెప్పింది.

'ప్రైవేటు పాఠశాలల కంటే మేమే ముందున్నాం'

ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తక్కువగా ఉండే రోజులు పోయాయి.మన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తక్కువగా ఉన్నాయని ప్రైవేటు పాఠశాలలు నినదించే సందర్భాలున్నాయి ఇప్పుడు మేమే బెస్ట్‌గా ఉన్నామని, గర్వంగా చెప్పుకుంటున్నామని చెప్పారు. ."

న‌న్ను చూసి నా సోద‌రికి అసూయ‌గా ఉంది

"ఇంట్లో నేను ఇంగ్లీషులో మాట్లాడటం మొదలుపెట్టాక మా పేరెంట్స్ చాలా సంతోషించారు. కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నా సోద‌రి నన్ను చూసి అసూయపడుతోంది. తను బాగా మాట్లాడగలనని చెప్పింది, కానీ ఎవరు బాగా మాట్లాడతారో నాకు తెలుసు" అని 8వ తరగతికి చ‌దువుతున్న‌ సాత్విక్ చిరున‌వ్వుతో చెప్పాడు. సాత్విక్ ప్రకారం.. ఎక్కడైనా కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లీష్ కీలకం. అతని లక్ష్యం రైల్వే అధికారి కావ‌డ‌మే.

'ట్రోల్స్‌ గురించి పట్టించుకోవద్దు'

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీషులో మెరుగ్గా మాట్లాడగలరని బెండపూడి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు తొలిసారిగా నిరూపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంభాషించే అవకాశం కూడా వారికి లభించడంతో వారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే వారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కాగా.. ఇప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడితే నెటీజ‌న్లు ట్రోల్స్ చేస్తారు అనే దానిపై నిడమనూరు విద్యార్థులు భ‌య‌ప‌డ‌డం లేదు. "బెండపూడి విద్యార్థినులను ట్రోల్ చేయడాన్ని మేము చూశాము, ఇది చాలా ఘోరంగా ఉంది. ట్రోల్ చేసేవారికి ఇంగ్లీష్ రాదని మేము భావిస్తున్నాము. మా వీడియోలపై మాకు ప్రతికూల వ్యాఖ్యలు వచ్చాయి, ఇది నకిలీ అని, మేము వీడియో కోసం మగ్ అప్ చేయబడ్డాము. కానీ మేం చెప్పేదంతా 'వి డోంట్ కేర్'. అదే మా టీచర్లు మరియు తల్లిదండ్రులు మాకు చెప్పారు" అని ఫర్హీన్ అంది.

ట్రోల్స్ గురించి ప్రధానోపాధ్యాయుడు బి.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో చాలా ట్రోల్స్ చూశాం. అది ఆడపిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. వర్క్‌షాప్ తర్వాత మా విద్యార్థులు మంచి ఇంగ్లీష్ మాట్లాడటం ప్రారంభించారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని మమ్మల్ని అభ్యర్థించారు. తమ పిల్లలు ట్రోల్ చేయబడతారని వారు భయపడుతున్నారు అని చెప్పారు.

మోడల్ స్కూల్

1962లో ఏర్పాటైన ఈ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఒకటి. 1,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో ఆరు డిజిటల్ తరగతి గదులు, ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్, ల్యాబ్‌లు, CCTVలు మరియు NCC కార్యాలయం ఉన్నాయి. "న్యూట్రే గ్రో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి విద్యార్థి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ను లెక్కించే యంత్రం కోసం ఎంపిక చేయబడిన రాష్ట్రంలోని రెండు పాఠశాలల్లో ఇది ఒకటి. మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులు కింద ఉన్న ఫుడ్ ప్లేట్‌ను స్కాన్ చేయాలి. యంత్రం.. విద్యార్థికి ఆహార పరిమాణం సరిపోతుందో లేదో చూపిస్తుంది. డేటా CM డ్యాష్‌బోర్డ్‌కు కనెక్ట్ చేయబడుతుంది," అని సురేష్ కుమార్ తెలిపారు.


విద్యార్థుల పోటీ స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు పాఠశాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు రూ. ప్రతి సంవత్సరం అకడమిక్స్‌లో 90శాతం పైన సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ప్రోత్సాహాల‌కు అందిస్తున్నారు.

Next Story