ఏపీ అదనపు హైకోర్టు భవనానికి సీజే శంకుస్థాపన

CJ lay the foundation stone for the additional high court building.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి ప్రాంతంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2021 5:55 AM GMT
ఏపీ అదనపు హైకోర్టు భవనానికి సీజే శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి ప్రాంతంలో ఉన్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని నిర్మించ‌డానికి శంకుస్థాప‌న చేశారు. సోమ‌వారం ఉద‌యం 9.50 నిమిషాల‌కు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(సీజే) జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా చేతుల మీదుగా శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో హైకోర్టు న్యాయ‌మూర్తులు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు, బార్ అసోయేష‌న్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ప్ర‌స్తుత హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు చోటు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదురుగా ఉన్న స్థలంలో మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ అద‌న‌పు భవనాన్ని గ్రౌండ్‌+5 అంతస్థులుగా నిర్మించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

Next Story