నేటి అర్థ‌రాత్రి నుంచి ఓఆర్ఆర్ పై వాహ‌నాలకు అనుమ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2020 12:24 PM GMT
నేటి అర్థ‌రాత్రి నుంచి ఓఆర్ఆర్ పై వాహ‌నాలకు అనుమ‌తి

ఓఆర్ఆర్ ( ఔటర్​ రింగ్​ రోడ్డు) రోడ్డు పై ప్ర‌యాణించే వారికి గుడ్‌న్యూస్‌. లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపు రెండు నెల‌లుగా మూత‌ప‌డ్డ ఔట‌ర్ రింగ్ రోడ్డు తెరుచుకోనుంది. ఈ రోజు అర్థ‌రాత్రి నుంచి ఓఆర్ఆర్‌పై అన్ని వాహానాల‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ) అధికారులు తెలిపారు. కేంద్ర‌ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్లో భాగంగా మంగ‌ళ‌వారం అర్థరాత్రి నుంచి వాహానాలను అనుమతించాల‌ని హెచ్ఎండీఏ, హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌) నిర్ణంచాయి.

ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్​ఆర్​పై టోల్​గేట్​ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది. ఓఆర్​ఆర్​ టోల్​ ప్లాజాల వద్ద ఫాస్ట్​ టాగ్​ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్​ పేమెంట్​ పద్ధతిలో ఫాస్ట్​ టాగ్​​ చెల్లింపులకు అవ‌కాశం ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాయి. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్​ఎండీఏ సూచించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటున్న నేప‌థ్యంలో ఆ స‌మ‌యంలో ఓఆర్​ఆర్​పై కార్లను అనుమతించడం జరగదు. ఓఆర్​ఆర్​పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్​ వెహికిల్స్​)లో ప్రయాణీకులున్నట్లుగా టోల్​ ప్లాజా సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందజేయాలని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.

Next Story