ఉద్యోగుల‌కు యోగి స‌ర్కార్‌ గుడ్‌న్యూస్ : దీపావళికి ఒక నెల బోనస్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 5:55 AM GMT
ఉద్యోగుల‌కు యోగి స‌ర్కార్‌ గుడ్‌న్యూస్ : దీపావళికి ఒక నెల బోనస్‌

ఉత్తరప్రదేశ్‌లోని యోగి స‌ర్కార్‌ దీపావళి పండుగ వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ‌ కానుకగా ఒక నెల బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో నాన్-గెజిటెడ్ రాష్ట్ర ఉద్యోగులు, ప్రభుత్వ, సహాయక విద్యా సంస్థల సిబ్బంది, స్థానిక సంస్థలు, జిల్లా పంచాయతీలతో పాటు రోజువారీ కూలీలు కూడా 30 రోజుల బోనస్‌ను దీపావళి బహుమతిగా అందుకుంటారు.

యోగి స‌ర్కార్ నిర్ణ‌యంతో సుమారు 15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో రాష్ట్ర ఖజానాపై 1,023 కోట్ల రూపాయల భారం పడనుంది. నిబంధనల ప్రకారం.. కేటాయించిన బోనస్ ప్రతి ఉద్యోగికి గరిష్టంగా 6,908 రూపాయలు. బోనస్‌లో 25 శాతం నగదు రూపంలోనూ, మిగిలిన 75 శాతం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) కు చేర్చబడుతుంది. పీఎఫ్ ఖాతా లేని వారికి అదే మొత్తానికి జాతీయ భద్రతా ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుంది. అలాగే.. 2021 ఏప్రిల్ 30 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు.. 2020 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కూడా అర్హత కలిగిన తాత్కాలిక బోనస్‌ను అందుకుంటారు.

Next Story