తెలంగాణలో కొత్తగా 62 కరోనా కేసులు

By సుభాష్  Published on  23 May 2020 2:25 AM GMT
తెలంగాణలో కొత్తగా 62 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాకున్నా ఒక్క హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం విజృంభిస్తోంది. కేసు శుక్రవారం ఒక్క రోజే 62 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం 1761 కేసులు నమోదు కాగా, 48 మంది వరకూ మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకూ 1,048 మంది డిశ్చార్జ్‌ కాగా, 670 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

అయితే శుక్రవారం కరోనా నుంచి కోలుకుని ఏడుగురు డిశ్చార్జ్‌ కాగా, ముగ్గురు మృతి చెందారు. ప్రతి రోజు నమోదువుతున్న కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో 42 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా, రంగారెడ్డి పరిధిలో ఒకటి, మరో 19 మంది వలస కార్మికుల నుంచి సోకింది.

కాగా, వరంగల్‌ రూరల్‌, యాదాద్రి భువగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. మిగతా జిల్లాల్లో కూడా గత 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Ts Corona Cases

Next Story