పొట్టి నిక్కరుతో త్రిష డ్యాన్స్.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 3 April 2020 9:59 PM IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి మన దేశంలో లాక్డౌన్ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక సెలబ్రిటీలు మాత్రం తమ రోజువారీ పనులను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న మన స్టార్ హీరోయిన్లు తమ టాలెంటును బయటకు తీస్తున్నారు.
కథనాయిక త్రిష అత్యంత ప్రజాదారణ పొందిర టిక్టాక్ యాప్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ హాలీవుడ్ గాయని మేగాన్ నీ స్టాలియన్ పాడిన సేవేజ్ కు డ్యాన్ చేసి తొలి వీడియోను పోస్టు చేసింది. ఉదా రంగు టాప్, నలుపు రంగు స్కట్లో అమ్మడు చేసిన డ్యాన్స్కు నెటీజన్లను ఫిదా అయ్యారు. పొట్టి నిక్కరుతో చేసిన డ్యాన్స్ హాట్ హాట్ గా మారింది. ఇక టిక్ టాక్లో త్రిషను ఆపేది ఎవరు అనే విధంగా ఫోజులిచ్చింది. దీంతో వీడియో వైరల్గా మారింది. త్రిష డ్యాన్స్ అదుర్స్, సూపర్ అంటూ నెటీజన్లు తెగ కామెంట్లు చేసేస్తున్నారు. లాక్డౌన్ కాలాన్ని త్రిష.. కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు జంతువులతో గడుపుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పెంపుడు జంతువులను కాపాడాలని ప్రజల్ని కోరారు. తన ఇంటి దగ్గర శునకాలకు ఆహారం పెడుతున్న వీడియోలను షేర్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఇదిలా ఉండగా త్రిష ప్రస్తుతం మణిరత్నం రూపొందించే పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే ఆమె నటించిన పారపాధమ్ విలయట్టు, గర్జనాని, రాంగీ, షుగర్, రామ్ లాంటి చిత్రాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. కాగా ఇటీవల చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమా నుంచి ఈ భామ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.