గణనాథుల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2020 3:17 AM GMT
గణనాథుల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

గణనాథుల నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమైంది. పది రోజుల పాటు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యలు కొద్ది గంటల్లో గంగమ్మ బడిని చేరనున్నారు. హైదరాబాద్‌ నగరంలో గణనాథుని నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని అన్ని వైపుల‌ నుంచి విగ్రహాలు మెయిన్ రోడ్‌లో పయనించి హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడి ఊరేగింపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటలకు నిమర్జనాన్ని పూర్తి చేయనున్నారు. గణనాథుల నిమర్జనం కోసం అధికారులు 21 క్రేన్లను సిద్ధం చేశారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు..

నిమజ్జనం సంధర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 9గంట‌ల నుంచి బుధవారం ఉదయం 8గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. నిమజ్జన ప్రక్రియ పూర్తికాకపోతే ఆంక్షలను పొడిగించనున్నామని సీపీ (ట్రాపిక్‌) ఎస్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు.

-మెయిన్ రూట్స్‌లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ఏరియాల్లో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి.

-నెక్లెస్‌రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లపై కేవ‌లం గ‌ణ‌నాథుడి నిమజ్జనానికి వచ్చే వాహనాలకు మాత్రమే ప‌ర్మిష‌న్ ఇస్తారు.

-ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారు.. వచ్చేవారు.. ఓ.ఆర్‌.ఆర్ మీదుగా రాకపోకలు కొనసాగించడం మంచిది. ఇమ్లీబన్, జేబీఎస్‌లకు రాకపోకలు సాగించే జిల్లాల బస్సులు ఊరేగింపు లేని రూట్ల‌ను ఎంచుకోవాలి.

ప్రజలు, భక్తులు సమాచారం కోసం 040-2785 2482, 9010203626

Next Story