రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ జయశ్రీ అరెస్ట్

సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ రైతుబంధు కుంభకోణం వెలుగులోకి రావడంతో తహసిల్దార్ జయశ్రీ తో పాటు ధరణి ఆపరేటర్ జగదీష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

By Kalasani Durgapraveen  Published on  10 Oct 2024 5:10 AM GMT
రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ జయశ్రీ అరెస్ట్

సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ రైతుబంధు కుంభకోణం వెలుగులోకి రావడంతో తహసిల్దార్ జయశ్రీ తో పాటు ధరణి ఆపరేటర్ జగదీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వీరిని కోర్ట్ లో హాజరుపరచగా.. కోర్టు తహసిల్దార్ జయశ్రీ కి 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. తహసిల్దార్ జయశ్రీ గతంలో హుజూర్నగర్ తాసిల్దారుగా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడింది. ప్రస్తుతం జయశ్రీ నల్లగొండ జిల్లా అనుముల తాసిల్దార్ గా పనిచేస్తున్నారు.ధరణి ఆపరేటర్ జగదీష్ తో కలిసి కుంభకోణానికి పాల్పడింది.హుజూర్నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపు స్తకాలు పొంది రైతుబంధు నిధులు స్వాహా చేశారు.రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులను తహసి ల్దార్, ధరణి ఆపరేటర్ కలిసి స్వాహా చేశారు.తహసిల్దార్ జయశ్రీ ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు జారీ చేసింది. పోలీసులు తహసిల్దార్ పై 420,406,409,120(b),468,467 IPC సెక్షన్లు క్రింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు తహసిల్దారును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

Next Story