భారత్ కరోనా అప్డేట్.. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
India Reports 6422 new covid 19 cases. బుధవారంతో పోలిస్తే గురువారం కేసుల సంఖ్య పెరిగింది.
By తోట వంశీ కుమార్ Published on
15 Sep 2022 4:57 AM GMT

రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం కేసుల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా 3,14,692 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా కొత్తగా 6,422 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,16,479కి చేరింది. నిన్న 5,748 మంది కోలుకోగా.. మొత్తం 4,39,41,840 మంది ఈ మహమ్మారిని జయించారు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5,28,250 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 46,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.71 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.04 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 31,09,550 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 215.98 కోట్ల డోసులను పంపిణీ చేశారు.
Next Story