2025లో భారతీయుల ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీకి అగ్రస్థానం

2025 సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాలో బిర్యానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది

By -  Knakam Karthik
Published on : 6 Jan 2026 11:00 AM IST

National News, Indian food, Biryani

2025లో భారతీయుల ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీకి అగ్రస్థానం

2025 సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాలో బిర్యానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ డేటా ప్రకారం, ఈ ఏడాది బిర్యానీకి ఏకంగా 9.3 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో బిర్యానీకి ఉన్న ఆదరణను ఇది స్పష్టంగా చూపిస్తోంది.

బిర్యానీ తరువాత స్థానాల్లో ఫాస్ట్ ఫుడ్ పదార్థాలు నిలిచాయి. బర్గర్‌కు 4.42 కోట్ల ఆర్డర్లు నమోదు కాగా, పిజ్జాకు 4.01 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. పాశ్చాత్య ఆహారాలపై యువతలో ఉన్న క్రేజ్‌ను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. అదే సమయంలో, దక్షిణ భారత సంప్రదాయ వంటకం అయిన దోసా కూడా 2.62 కోట్ల ఆర్డర్లతో టాప్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

ఆరోగ్యకరమైన అల్పాహారంగా దోసాకు దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణ కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, 2025లో భారతీయుల ఆహార అభిరుచుల్లో బిర్యానీకి అగ్రకిరీటం కొనసాగుతుండగా, ఫాస్ట్ ఫుడ్‌తో పాటు సంప్రదాయ వంటకాలకు కూడా సమాన ఆదరణ లభిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

Next Story