వైభవంగా తిరుమల శ్రీవారి ప్రణయకలహోత్సవం

Vaikunta Ekadashi celebrations in Tirumala Tirupati. కలియుగ దైవం శ్రీవారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి.

By అంజి  Published on  19 Jan 2022 5:31 AM GMT
వైభవంగా తిరుమల శ్రీవారి ప్రణయకలహోత్సవం

కలియుగ దైవం శ్రీవారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు సాయంత్రం శ్రీవారి ప్రణయ కలహోత్సవం వేడుక ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీవారిని, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీల నుండి వేరు వేరుగా ఉత్సవ మండపం నుండి బయల్దేరారు. ఆ తర్వాత వరాహస్వామి ఆలయం వద్ద కలిశారు. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశికి ఆరో రోజు కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకను పూర్తిగా కోవిడ్‌-19 నిబంధనల మధ్య నిర్వహించారు.

ప్రణయకలహోత్సవంలో భాగంగా శ్రీమలయప్పస్వామి వారి పల్లకి ఎక్కి స్వామి పుష్కరిణి దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత అమ్మవారులు కూడా చెరొక పల్లకిపై వచ్చి స్వామి వారికి ఎదురువచ్చి నిలుచున్నారు. ఆ తర్వాత అర్చుకులు.. స్వామి, అమ్మవార్ల తరఫున వేరు వేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతించారు. ఆ తర్వాత నిందాస్తుతి చేసి పూలబంతులు విసురుకోవడం, తానేమి తప్పు చేయలేదని అమ్మవార్ల ముందు స్వామి ప్రాధేయపడటం, ఆ తర్వాత అమ్మవార్లు స్వామి వారికి కర్పూరహారతులు అందుకోవడం వంటి సన్నివేశాలతో ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story