పిడుగుపాటుకు నవ వరుడు సహా ఐదుగురు మృతి

By సుభాష్  Published on  27 April 2020 7:06 AM GMT
పిడుగుపాటుకు నవ వరుడు సహా ఐదుగురు మృతి

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా దేశంలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు సహ పలు రాష్ట్రాల్లో గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా పిడుగులు పడి నవ వరుడు సహా ఐదుగురు మరణించారు.

తమిళనాడులో ఆదివారం ఏకధాటిక సుమారు ఆరు గంటల పాటు వర్షం కురిసింది. ఇక కాంచీపురంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన నవ వరుడు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. అటు తిరువళ్లూరు జిల్లా నేమలూరులో రైతు చంద్రన్‌, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు నదిలో చేపలు పడుతున్న ఆనందన్‌, పొలానికి వెళ్తున్న విద్యార్థిని మహాలక్ష్మీలు పిడుగు పాటుకు మృతి చెందారు. అలాగే నమక్కల్‌ జిల్లా పరమత్తివేలూరులో మరో వ్యక్తిపై కొబ్బరి చెట్టు విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇక ఏపీలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ల చిన్నారి పిడుగు పడి మృతి చెందింది. ఇక ఏపీలో వచ్చే 48 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Next Story