జూదం ఆడి.. రూ.92 లక్షలు పొగొట్టిన యువకుడు.. పాపం కుటుంబాన్ని రోడ్డున పడేశాడే.!

Young Man lost 92 lakhs after playing casino. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి తన కుటుంబాన్ని రోడ్డున పడేశాడో యువకుడు. తన కొడుకు ఆన్‌లైన్ క్యాసినోలో

By అంజి  Published on  21 Dec 2022 7:14 AM GMT
జూదం ఆడి.. రూ.92 లక్షలు పొగొట్టిన యువకుడు.. పాపం కుటుంబాన్ని రోడ్డున పడేశాడే.!

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి తన కుటుంబాన్ని రోడ్డున పడేశాడో యువకుడు. తన కొడుకు ఆన్‌లైన్ క్యాసినోలో జూదమాడడంతో ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారంగా అందిన రూ.92 లక్షలను ఓ రైతు పోగొట్టుకున్నాడు. తెలంగాణలోని హైదరాబాద్‌కు సమీపంలోని రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. చిన్న కొడుకు మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ డబ్బు మొత్తం పోగొట్టడంతో శ్రీనివాస్ రెడ్డి కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపన వివరాలు ఇలా ఉన్నాయి.

షహాబాద్ మండలం సీతారాంపూర్‌లో శ్రీనివాస్‌రెడ్డికి చెందిన 10 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) కోసం ప్రభుత్వం ఇటీవల సేకరించింది. ఎకరాకు రూ.10.5 లక్షల చొప్పున రూ.1.05 కోట్ల పరిహారం అందింది. ఈ డబ్బుతో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మండలం మల్లాపూర్‌లో అర ఎకరం భూమిని కొనుగోలు చేయాలనుకున్నాడు. 70 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ గా రూ.20 లక్షలు చెల్లించాడు. మిగిలిన రూ.85 లక్షల్లో శ్రీనివాస్ రెడ్డి తన బ్యాంకు ఖాతాలో రూ.42.5 లక్షలు, మిగిలిన మొత్తాన్ని భార్య విజయలక్ష్మి ఖాతాలో జమ చేశాడు.

హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ దంపతుల చిన్న కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి తన తండ్రి ఖాతాలో ఉన్న డబ్బును తన ఖాతాలోకి మార్చుకుని భూమి యజమానికి చెల్లిస్తానని చెప్పాడు. ఇదే విషయాన్ని తల్లికి చెప్పి ఆమె ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకునేలా చేయించాడు. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేందుకు అలవాటు పడిన ఆ యువకుడు ఆన్‌లైన్ కేసినోలలో వాయిదాల పద్ధతిలో డబ్బును పెట్టడం ప్రారంభించాడు. కొన్ని వారాల్లో, అతను మొత్తం డబ్బును కోల్పోయాడు.

డబ్బు గురించి తల్లిదండ్రులు ఆరా తీయగా.. జూదం ఆడుతున్నట్లు అంగీకరించాడు. భార్యాభర్తలు, వారి పెద్ద కుమారుడు బీటెక్‌ చదువుతున్న సిర్పాల్‌రెడ్డి షాక్‌కు గురయ్యారు. హర్షవర్ధన్ రెడ్డి కూడా జూదం ఆడేందుకు గ్రామంలోని కొందరి నుంచి రూ.7 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై తల్లిదండ్రులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొడుకు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Next Story