యువకుడి ప్రాణం తీసిన పూరి..గొంతులో ఇరుక్కుపోవడంతో

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్‌లో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది.

By Knakam Karthik
Published on : 7 July 2025 12:00 PM IST

Telangana, Mahabubnagar District, Young Man Dies, Poori Struck Man Throat

యువకుడి ప్రాణం తీసిన పూరి..గొంతులో ఇరుక్కుపోవడంతో

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్‌లో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పూరి గొంతులో ఇరుక్కుని ఊపిరాడక యువకుడు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. ఖానాపూర్‌ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్‌(26) అదే మండలంలోని తిర్మలాపూర్‌లో ఓ వ్యక్తి పొలంలో గత కొంతకాలంగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. పొలం పనులు చేస్తున్న కుమార్‌కు పొలం యజమాని టిఫిన్ చేయడానికి పూరి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో పూరి తింటుండగా గొంతులో ఇరుక్కొంది. దీంతో కుమార్ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు.

Next Story